Wednesday, May 8, 2024

జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్ లో తెలంగాణకు అగ్రస్థానం.. విజేతలను అభినందించిన హోంమంత్రి

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఈ మ‌ధ్య‌ జరిగిన 6వ జాతీయ ప్రిజన్ డ్యూటి మీట్ లో తెలంగాణ టాప్ లెవ‌ల్‌లో నిలిచిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ సంద‌ర్భంగా విజేతలను తన ఆఫీసులో ఇవ్వాల (బుధవారం) అభినందించారు. జైళ్ల‌ శాఖ డీజీ జితేందర్, ఐజీ రాజేష్ తదితర అధికారులు పాల్గొన్న ఈ స‌మావేశంలో అధికారులు జాతీయ డ్యూటీ మీట్ లో తెలంగాణ అగ్రస్థానం సాధించిన వివరాలను వెల్లడించారు.

కాగా, ఈ డ్యూటి మీట్ లో మొత్తం 19 రాష్ట్రాలు , 960 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, మూడు రోజుల పాటు జరిగిన కార్య‌క్ర‌మంలో 68 మంది తెలంగాణ జైళ్ల శాఖ ఉద్యోగులు వివిధ క్రీడాంశాలల్లో అద్భుతమైన ప్రతిభను కనబరచారని హోంమంత్రి కొనియాడారు. ఆరు బంగారు, ఒక వెండి, రెండు రజత పతకాలతో పాటు నాలుగు ట్రోపీలు సాధించడమే కాక , అత్యధిక పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. డ్యూటి మీట్ లో బృందానికి వరంగల్ కేంద్రకారాగార పర్యవేక్షాణాధికారి సంపత్ సారథ్యం వహించారు. ఈ అభినందన కార్యక్రమంలో దేశంలో మొదటి స్థానం సాధించినందుకు కృషి చేసిన జైళ్ల శాఖ డీజీ జితేంధర్ , ఐజీ రాజేష్ ను హోం మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement