Wednesday, May 22, 2024

ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమైక్యతా దినోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలను నిర్వహించిన ప్రభుత్వం శని, ఆదివారాలు కూడా ఈ వేడుకలను జరపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement