Saturday, April 27, 2024

పెద్దపల్లి రైతులను ఆదుకోండి.. సీఎంకు విన్నవించిన ఎమ్మెల్యే దాసరి

వడగళ్ల వానతో పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, వారిని ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విన్నవించారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి నియోజకవర్గంలో జరిగిన పంట నష్టంపై నివేదిక అందజేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం నియోజకవర్గంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి పదివేల రూపాయల పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement