Sunday, April 28, 2024

పిడుగు పడి ఇల్లు ధ్వంసం..

మనుబోలు మండలంలోని జట్ల కొండూరు పంచాయతీ జట్ల కొండూరు సత్రం గిరిజన కాలనీలో ఓ మిద్ది పైన పిడుగు పడింది. ఈ పిడుగు బాటు నుంచి గిరిజన కుటుంబం రెప్పపాటులో ప్రాణాలతో బయట పడ్డారు. ఆదివారం రాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.. సోమవారం తెల్లవారుజామున కోవూరు వెంకటరమణయ్య మిద్ది పై పిడుగు పడింది. దీంతో మిద్ది స్లాబు ధ్వంసం అయింది. అలాగే ఇంట్లో ఉన్న టీవీ.. ఫ్యాన్లు కాలి పోయాయి.. చుట్టు పక్కల కొన్ని కుటుంబాలలో ఫ్యాన్లు.. టీవీలు పాడ‌యి నష్టపోయారు. అలాగే సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేని వర్షం తో పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర అసౌకర్యంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement