Friday, April 26, 2024

ప్రాజెక్టుల డిపిఆర్ లు ఇవ్వండి: తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డ్ ఆదేశం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. త్వరగా డీపీఆర్ లు సమర్పించాలని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శికి, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి గోదావరి బోర్డు లేఖలు రాసింది. అపెక్స్ కౌన్సిల్, బోర్డు నిర్ణయాల మేరకు డీపీఆర్ లు ఇవ్వాలని సూచించింది. డీపీఆర్ లు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని గుర్తు చేసింది. బోర్డు, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు లోబడి డీపీఆర్ లు ఉండాలని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది.

కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పతాక స్థాయికి చేరడంతో స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించేందుకు కేంద్రం… కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల పరిధుల‌ను ఖరారు చేస్తూ గెజిట్ల‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ కేటాయింపులున్న ప్రాజెక్టుల‌న్నీ కృష్ణాబోర్డు ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని కేంద్రం పేర్కొన్న‌ది. కృష్ణాన‌దిపై 36, గోదావ‌రిపై 71 ప్రాజెక్టుల‌ను ఈ బోర్డు ప‌రిధిలోకి తీసుకొచ్చింది. అనుమ‌తిలేని ప్రాజెక్టులు 6 నెల‌ల్లోగా అనుమ‌త‌లు తెచ్చుకోవాల‌ని, ఒక‌వేళ అనుమ‌తులు రాకుంటే ప్రాజెక్టులు నిలిపివేయాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. బోర్డుల‌కు ఛైర్మ‌న్లు, స‌భ్య‌కార్య‌ద‌ర్శి, చీఫ్ ఇంజ‌నీర్లు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌వార‌ని, అన్ని ప్రాజెక్టుల నిర్వాహ‌ణ బోర్డులే చూసుకుంటాయ‌ని, ఒక్కోరాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చోప్పున డిపాజిట్ చేయాల‌ని, సీడ్ మ‌నీ కింద 60 రోజుల్లో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాల‌ని కేంద్రం పేర్కొన్న‌ది. ఇక నిర్వాహ‌ణ ఖ‌ర్చుల‌కు అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement