Sunday, April 28, 2024

TS: 12న నిర్వహించే బీఆర్ఎస్ సభా స్థలాన్ని పరిశీలించిన గంగుల

ఈనెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే కరీంనగర్ కదనభేరి, పార్కింగ్ , సభ స్థల ఏర్పాట్లను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు.. కదనభేరి సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

స్థల పరిశీలన కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, గందె మహేష్, ఏసీపీ విజయ్ కుమార్, ఎస్ బి ఇన్స్పెక్టర్ సృజన్ కుమార్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఓ రమేష్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement