Tuesday, May 14, 2024

Nizamabad | సొంత గుటికి కమలం కార్పొరేటర్లు…

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : నిజామాబాద్ అర్బన్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్‌ఎస్ పార్టీ కి పెద్ద దెబ్బే తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇవ్వాల (ఆదివారం) నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో బీజేపీ పార్టీలో చేరిన.. మల్లేష్ యాదవ్, బైకాన్ సుధా మధు, ఆకుల హేమలత శ్రీనివాస్, సుంకరి నారాయణలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ మాట్లాడుతూ.. ఘర్ వాపసీలో భాగంగా బీజేపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాసనసభ్యులు దన్‌పాల్‌ సూర్యనారాయణ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మి నరసయ్య, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మల్లేష్‌ యాదవ్‌, బైకాన్‌ సుధా మధు, ఆకుల హేమలత శ్రీనివాస్‌, సుంకరి నారాయణ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement