Tuesday, May 7, 2024

Flash.. Flash: మంచిర్యాల జిల్లాల్లో భూకంపం

మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రామగుండంలో భూమి స్వల్పంగా కంపించింది. జిల్లా కేంద్రంలోని చున్నoబట్టివాడ, శ్రీ శ్రీ నగర్ తో పాటు సీతారాంపల్లి, నస్పూర్ , సీతా రాంపూర్, అమ్మ గార్డెన్ ప్రాంతాలలో 2 సెకండ్ల పాటు స్వల్పంగా కంపించినట్టు తెలుస్తోంది. దీంతో భయపడిన జనం బయటకు పరుగులు తీశారు. సీతారాంపల్లెలోనూ స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం రిక్టర్ స్కేల్‎పై 4 తీవ్రతగా న‌మోద‌య్యింది. అటు మంచిర్యాల జిల్లాలోనూ భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాలలోని రాంనగర్, గోసేవ మండల్ కాలనీలో భూమి కంపించిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement