కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కన్నకొడుకుని తండ్రి కత్తితో నరికి చంపిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనతో చొప్పదండి టౌన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణానికి చెందిన దూస వైకుంఠం శుక్రవారం సాయంత్రం తన కుమారుడు వెంకటేష్ (31)ని కత్తితో మెడపై నరికాడు. ఈ దాడితో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతదేహం చుట్టూ రక్తం వరద కట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతకాలంగా వారి కుటుంబంలో తలెత్తిన వివాదాలే ఈ మర్డర్కి కారణమని ప్రాథమిక సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement