Thursday, May 16, 2024

Encounters in Assembly – ఊపర్ షేర్వాణీ అందర్ పరేషానీ….ఇది బిఆర్ ఎస్ ఘ‌న‌త‌.. పొన్నం

హైదరాబాద్ గ‌త కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ‌లో అభివృద్ది శూన్య‌మంటూ కెటిఆర్ అసెంబ్లీలో పేర్కొన‌డంపై మంత్రి పొన్నం మండి ప‌డ్డారు.. తెలంగాణలో గత ప్రభుత్వ కార్యకలాపాలపై మాట్లాడేందుకు ఏమీ కనిపించడం లేదని చెప్పారు. పైన పటారం లోన లొటారం తరహాలో గత ప్రభుత్వం పాలించిందని, ఊపర్ షేర్వాణీ అందర్ పరేషానీ తీరులో పాలన జరిపిందని విమర్శించారు.

ప్రతిపక్ష నేతగా వాస్తవాలను మాట్లాడాలని అంతేకానీ మా తాతలు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారని చెబితే కుదరంటూ మండిపడ్డారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల గురించి మాట్లాడాలని, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప‌దేశ్ ప్ర‌స్తావన వ‌ద్దంటూ కేటీఆర్ కు హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement