Thursday, May 2, 2024

ఎడ్లపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

మళ్హర్, (ప్రభ న్యూస్) : మండలంలోని ఎడ్లపల్లిలో భూపాలపల్లి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కటారం సిఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 7 గంటలకు గ్రామచావిడి వద్దకు అందరిని పిలిపించి గ్రామంలో అపరిచిత వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. భూ తగాదాలు పెట్టుకోవద్దని, గొడవలు పెట్టుకోకుండా సామరస్యంగా చేసుకోవాలన్నారు. ఒమిక్రాన్, క‌రోనా మళ్ళీ విజృంభిస్తోందని, రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయన్నారు. అందువ‌ల్ల మాస్క్, శానిటైజ‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా వాడాల‌న్నారు. మన కుటుంబం బాధ్యత మనపై ఉందని, కుటుంబాన్ని నడిపించే బాధ్యత మనపై ఉందని ప్రజలకు గుర్తుచేశారు. మాస్క్ లేకుంటే వెయ్యి రూపాయలు జరిమానా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, 20 మంది జిల్లా పోలీసులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement