Friday, April 26, 2024

డిసెంబర్ టార్గెట్.. వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలే

ప్ర‌భ‌న్యూస్: డిసెంబర్‌లోగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఆయన నిన్న‌ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్‌, రెండో డోస్‌ ఎంత మంది తీసుకున్నారనే వివరాలను సేకరించాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశాలు, వైద్యులు గ్రామస్థాయి సబ్‌ సెంటర్‌ స్థాయి, పీహెచ్‌సీ స్థాయిలో ప్రణాళికలు వేసుకొని ప్రతి ఒక్కరు రెండు డోసుల కొవిడ్‌ టీకా వేసుకునేలా చూడాలని తెలిపారు.

ప్రజల్లో టీకాపై ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా కాలేజీ క్యాంపస్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రైవేట్‌ కార్యాలయాలు, మార్కెట్లపై దృష్టి సారించి, అక్కడే వారికి వ్యాక్సిన్‌ కార్యక్రమం చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.55 కోట్ల డోసులు వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3.60 కోట్ల డోసులు వేశామని, మరో 1.90 కోట్లు వేయాల్సి ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement