Saturday, April 27, 2024

తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు మాతృవియోగం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కు మాతృవియోగం కలిగింది. సోమశ్ కుమార్ తల్లి మీనాక్షి సింగ్‌ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత మూడు వారాలుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బిహార్‌లోని సొంత గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మీనాక్షి సింగ్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. సీఎస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ సీఎస్‌ను ఫోన్లో పరామర్శించారు. అలాగే మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం ప్రకటించారు. సీఎస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement