Wednesday, May 8, 2024

విద్యుత్ షాక్ తో దంపతుల మృతి

చెన్నూర్ ఆంధ్రప్రభ: పట్టణంలోని లైన్ గడ్డ ప్రాంతానికి చెందిన బోల్లంపల్లి శ్రీనివాసచారి శశిదేవి అనే దంపతులు ఉదయం ఇంట్లో ఉన్న వాటర్ పైప్ తగిలి మృతి చెందారు. పట్టంలో జ్వలారి షాప్ నిర్వహణ తో పాటు తన నివాస ప్రాంతంలో వాటర్ ప్లాంట్ కూడా నిర్వహిస్తారు. ఉదయం తన ఇంట్లో ఉన్న వాటర్ జిఐ పైప్ తగిలి దంపతులు మృతి చెందడం తో కాలనీలో విషాదం నెలకొంది. మృతుడు శ్రీనివాస్ చెన్నూరు విశ్వకర్మ వర్తక సంఘం అధ్యక్షుడు ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉంటు దంపతులు ఇరువురు వ్యాపారం వ్యాహరాల్లో మిత్రుల జీవనం సాగిస్తున్న దంపతులు వారు కరెంటు షాక్ తో మృతి చెందిన సంఘటన తో కుటుంబ సభ్యులు మిత్రులు కాలనీ వాసులు తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు. మృతులకు ఇరువురు కుమారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement