Wednesday, May 8, 2024

Controversy – సాగ‌ర్ పై రాజ‌కీయ ర‌చ్చ వ‌ద్దు… మంత్రి అంబ‌టి..

గుంటూరు: నాగార్జున సాగర్‌ డ్యామ్‌ అంశంపై తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని మంత్రి అంబటి రాంబాబు కొన్ని మీడియా సంస్థలకు హితవు పలికారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి రాజకీయపరమైన ముడిపెట్టడం తగదని తెలంగాణలో ఏ పార్టీ వచ్చినా తమకు సంబంధం లేదని అన్నారు.

”ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. తెలంగాణలో మా పార్టీ లేదు. అక్కడ మేం పోటీ చేయలేదు. అలాంటప్పుడు ఏపార్టీని ఓడించాల్సిన అవసరం మాకు ఉండదు కదా. మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టును మేము వాడుకోం” అని మంత్రి అంబటి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement