Sunday, April 28, 2024

ADB : ఐటి దాడులను నిరశిస్తూ కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్ల పై జరుగుతున్న ఐటీ దాడులను నిరసిస్తూ స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా మంచిర్యాల చెన్నూరు జాతీయ రహదారి పై కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు దాడులకు బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కారణమంటూ వ్యతిరేక నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement