Saturday, May 11, 2024

Congress – బీఆర్‌ఎస్‌ పాలనలో ఎమ్మెల్యే బంధువులకే అన్ని పథకాలు…. అలీ షబ్బీర్

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)26: మాల ఉపకులాలు అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారని పూర్తి అన్యాయం జరిగిందనీ… లలో ఐక్యత రావాలని నిజా మాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్య ర్థి షబ్బీర్ అలీ తెలిపారు. దళితుల జీవితాల్లో వెలుగులు నిపింది ఇందిరమ్మ నే అన్నా రు.ఆదివారం నిజామాబాద్ పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన మాల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని వారి మద్దతు కోరారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ అంటరాని జాతు లన్నీ ఐక్యతతో ఉండాలన్నారు.

ఎస్సి కులాలు విచ్చిన్నం కాకూడదన్నారు.ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో మాదిగ ఓటు బ్యాంకు ను రాబట్టు కోవడం కోసం బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. దళిత జాతి రాజకీయ అధికా రంలోకి రాకుండా పూర్తిగా బానిసలు గా ఉంచాలని అనుకుంటున్నారని మండిప డ్డారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎమ్మెల్యే బంధువులకే అన్ని పథకాలనీ ఆరోపించారు. . నిజామాబాద్ అర్బన్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement