Monday, April 29, 2024

BJP – బిగాల తీసుకునే వ్యక్తి..దన్ పాల్ ఇచ్చే వ్యక్తి.. రాజాసింగ్

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)26: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిజానికి మద్దతిచ్చే వారి ఇండ్లకు బుల్డోజర్లు వస్తాయని గోషామహాల్ ఎమ్మేల్యే రాజాసింగ్ అన్నారు. అన్ని వర్గాలకు…మోదీ తో నే అభివృద్ది జరుగుతుందన్నారు. మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే బిజెపికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ నగరంలో బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్య నారాయణ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల కార్నర్ మీటింగ్ కు గోషామహాల్ శాసనసభ్యులు రాజాసింగ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ను గెలిపిస్తే దళిత ముఖ్యమంత్రి ని చేస్తానని కేసిఆర్ చెప్పి మోసం చేశాడనీ మండిప డ్డారు. నిజామాబాద్ అర్బన్ లో బిజెపి అర్బన్ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ ప్రజలకు సేవ చేయడానికి రాజకీ యాల్లోకి వచ్చాడని తెలిపారు. బిగాల తీసుకునే వ్యక్తి..దన్ పాల్ ఇచ్చే వ్యక్తి అని అన్నారు.

నిజామాబాదు రైల్వేస్టేషన్ కు రూ53 కోట్లు కేంద్రం ఇచ్చిం ది…. బీఆర్ఎస్ మాత్రం తామే ఇచ్చామని చెబుతుంది.. తెలం గాణ అభివృద్ధి చెందుతుం దంటే అది కేంద్రం ఇచ్చే నిధులతోనే ..కేంద్రం నుంచి ఒక్క పైసా వస్తలేదని కెసిఆర్ కెటిఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు. రూ9 లక్షల కోట్లు తొమ్మిదే ళ్ళలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పంపినా…ఒక్క పైసా ఇవ్వలేదని పచ్చి అబద్దాలు చెబుతున్నారు‌..

బీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్..ఎక్కడ?

బీఅరెస్ సర్కార్ స్టీరింగ్ నా ఇద్దరు బామ్మర్దుల చేతుల్లో ఉందనీ స్వయానా ఓవైసీ బ్రదర్స్ చెప్పారు..ఎంఐఎం వారు కలిసుంటే మతకల్లో లాలు జరగవని కెసిఆర్, కేటి ఆర్ వాళ్ళ కాళ్ళు మొక్కి వారి ని తమవద్ద ఉంచుకుంటున్నా రు..

ఓల్డ్ సిటీ మిని పాకిస్తాన్

- Advertisement -

ఓల్డ్ సిటీ మిని పాకిస్తాన్ అయింది..ఎక్కడైనా దాడి జరిగితే టెర్రరిస్టులు ఓల్డ్ సిటీలోనే దొరుకుతున్నారనీ రాజాసింగ్ తెలిపారు.
బిజెపి అధికారంలోకి వస్త ది..అధికారంలోకి రాగానే టెర్రరిజానికి మద్దతిచ్చే వారి ఇండ్లకు బుల్డోజర్లు వస్తయి అని పేర్కొన్నారు.

బిజెపి అర్బన్ అభ్య ర్థి దన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, కమిషన్ లకోసం కబ్జాల కోసం రాజకీయాల్లో రాలేదనీ.. నిజా మాబాద్ అర్బన్ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు .బిఆర్ఎస్ పార్టీ ల కు బుద్ది చెప్పాలని అన్నారు. నేను కష్ట పడి ఒక్కో మెట్టు ఎక్కి పైకి వచ్చాను. అంతే కానీ కమిషన్ లకోసం కబ్జాల కోసం రాజకీ యాల్లో రాలేదన్నారు. నా లక్ష్యం ఇందూరు ప్రజలకు అండగా ఉండి వాళ్ళ బాధల ను తీర్చడానికి మీలో ఒకడిగా ఉంటూ సేవ చేస్తానని అన్నా రు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య, అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, కార్పొరేటర్లు బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement