Sunday, April 28, 2024

ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా చాహత్ బాజ్పయ్

ఉట్నూర్ జూలై 2 (ప్రభన్యూస్) ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ నూతన ప్రాజెక్ట్ అధికారిగా చాహత్ వాజ్పేయిను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటర్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఐటిడిఏ పిఓగా పనిచేసిన వరుణ్ రెడ్డికి నిర్మల్ జిల్లా కలెక్టర్గా నియమించడంతో ఆయన కొద్ది నెలలు ఇన్చార్జి ఐటిడి ఏ పిఓగా వ్యవహరించారు. ఇన్చార్జి పి ఓ వల్ల పనులు సక్రమంగా జరగటం లేదని, పరిపాలన సేవలో అంతరాయం కలుగుతుందని ఆదివాసి సంఘాలు డిమాండ్ చేశాయి

తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తున్న చాహత్ బాజ్పేయి కి రెగ్యులర్ ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఐపిడిఏ పిఓగా నియమాకమైన చాహత్ బాజ్పాయ్ సోమవారం బాధ్యతలు స్వీకరించవచ్చని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement