Monday, May 13, 2024

ఆసియా క్రీడలకు నిఖత్ ఎంపిక.. పురుషుల విభాగంలో దీపక్, నిషాంత్

చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టులో తెలంగాణకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ చోటు దక్కించుకుంది. 19వ ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు జరుగుతాయి. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఎంపిక విధానం ప్రకారం ఈ టోర్నమెంట్ కోసం భారత బాక్సింగ్ టీమ్‌ని నిన్న ప్రకటించింది.

గత మేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించిన దీపక్ బోరియా, నిశాంత్ దేవ్‌లకు జట్టులో చోటు దక్కింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత అమిత్ పన్హాల్ స్కిల్ జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు.

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నికత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లాల్వినా మార్చిలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకోవ‌డంతో నేరుగా మహిళల జట్టుకు ఎంపికయ్యారు. అలాగే, ప్రపంచ ఛాంపియన్ నీతూ గంగాస్ తన స్థానాన్ని కోల్పోవ‌డంతొ ప్రీతి పవార్ 54 కేజీల విభాగంలో ఆసియా క్రీడలకు బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

- Advertisement -

ఆసియా క్రీడల భారత బాక్సింగ్ జట్టు ఇదే:-

మహిళలు: నిఖత్ జరీన్ (51 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), పర్వీన్ హుడా (57 కేజీలు), జైస్మిన్ లంబోరియా 60 కేజీలు, అరుంధతీ చౌదరి (66 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు).

పురుషులు: దీపక్ భోరియా (51 కేజీలు), సచిన్ సివాచ్ (57 కేజీలు), శివ థాపా (63.5 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), లక్ష్య చాహర్ (80 కేజీలు), సంజీత్ 92 కేజీలు, నరేందర్ బెర్వాల్ (92 కేజీలు).

Advertisement

తాజా వార్తలు

Advertisement