Saturday, May 18, 2024

భూపాలపల్లికి కేంద్ర బృందం రాక.. వరద నష్టాన్ని వివరించిన అధికారులు

భూపాలపల్లి (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారీ వర్షాలకు వరద బీభత్సం సృష్టించిన మోరంచపల్లి గ్రామాన్ని సందర్శించేందుకు బుధవారం కేంద్ర బృందం సభ్యులు ఏడుగురు సత్యార్థి, అనిల్, కుశ్వాహా, రమేష్ కుమార్, పొన్ను స్వామి, శ్రీనివాసులు, భావ్య పాండే లు జిల్లాకు చేరుకున్నారు.

ముందుగా జెన్ కో కు చేరుకున్న బృందంను జిల్లా కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం జెన్ కో గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో జిల్లాలో జరిగిన వరద నష్టాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ భవేష్ మిశ్రా కేంద్ర బృందంకు సమగ్రంగా వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement