Tuesday, May 7, 2024

Jana Sena – తెనాలి నుంచి నాదెండ్ల మ‌నోహార్ పోటీ – తొలి అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్..

మంగ‌ళ‌గిరి – జ‌న‌సేన వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేసే తొలి అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించింది.. స్వ‌యంగా ఆ పార్టీ అధినేత‌ల ప‌వ‌న్ కల్యాణ్ కంటెస్ట్ చేసే అభ్య‌ర్ధి పేరును ప్ర‌క‌టించారు.. తెనాలిలో నిర్వహించిన నియోజకవర్గ నాయకుల ఆత్మీయ సమావేశంలో జనసేనాని పాల్గొని ప్రసంగించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనాని మాట్లాడుతూ, ఈసారి తెనాలి నుంచి నాదెండ్ల మ‌నోహార్ పోటీ చేస్తార‌ని, భారీ మెజార్టీతో ఆయ‌న‌ను గెలిపించాల‌ని ప్రజలకు పిలుపునిచ్చారు.

2024 ఎన్నికల్లో తెనాలిలో ఎగిరేది జనసేన జెండానేనని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జనసేన నాయకుడిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు చూపిస్తామని, అద్భుతమైన పనులు నాదెండ్ల మనోహర్ చేస్తార‌ని చెప్పారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయి జనసేన వైపు చూస్తున్నారని, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement