Sunday, May 5, 2024

పంటనష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందించండి.. మంత్రి గంగుల

కరీంనగర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లను, పంట నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారీ వర్షాలు, వరద నష్టంపై జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతి నిధులు, అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారిగా పంట నష్టం, రోడ్డుల డ్యామేజి, ఎన్ని చెరువులకు గండి పడింది, తదితర అంశాలపై సమీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement