Monday, May 6, 2024

కూకట్‌పల్లిలో కారు బీభత్సం.. ఆగ్రహంతో దాడి చేసిన స్థానికులు

హైదరాబాద్ – ప్రగతినగర్ నుంచి ఎల్లమ్మ చెరువు వైపు వెళ్తున్న ఓ కారులో ప్రయాణిస్తున్న యువకులు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో అడ్డుగా ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు కార్లను ఢీకొట్టుకుంటూ వెళ్లారు. దీంతో ప‌లువురు గాయ‌ప‌డ్డారు..

స్థానికులు ఆగ్రహంతో వాహనదారులు కారును వెంబడించి కారులో ఉన్న ఇద్దరు యువకులనుబ‌య‌ట‌కు చితకబాదారు. కారుపై బండరాళ్లు విసిరి కారును పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు అక్క‌డికి చేరుకుని మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఇద్ద‌రు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement