Sunday, May 12, 2024

కారులో చెల‌రేగిన మంట‌లు.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ భార్యాభర్తలు

వేగంగా వెళ్తున్న కారులో మంట‌లు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. అప్ర‌మ‌త్త‌మైన దంప‌తులు ఆ ప్ర‌మాదం నుంచి త‌మ ప్రాణాల‌ను కాపాడుకున్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని గోదావ‌రిఖ‌నిలోని సీఎస్‌పీ ప్లాంట్ వ‌ద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. 8 ఇంక్లైన్ కాల‌నీకి చెందిన మ‌ధుసూద‌న్ రావు ఓసీపీ-3లో పంప్ ఆప‌రేట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఆయ‌న త‌న భార్య‌తో క‌లిసి గోదావ‌రిఖనికి బ‌య‌ల్దేరాడు. 7 ఎల్‌పీ కోల్ మైన్ స‌మీపంలోని సీఎస్‌పీ ప్లాంట్ వ‌ద్ద‌కు రాగానే కారు ఇంజిన్‌లో నుంచి పొగ‌లు రావ‌డాన్ని మధుసూద‌న్ గుర్తించాడు. దీంతో త‌క్ష‌ణ‌మే కారులో నుంచి భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ దిగేశారు. అంత‌లోనే కారు ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగి పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement