Sunday, May 19, 2024

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్తాం : ఏపీ హోమంత్రి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చిన విష‌యం విదిత‌మే. అయితే హైకోర్టుపై ఏపీ అధికార ఆర్టీ నేత‌లు స్పందిస్తున్నారు. రాష్ట్రానికి మూడు రాజ‌ధానులుంటాయ‌ని అంటున్నారు అధికార పార్టీ నేత‌లు. అయితే తాజాగా హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర హోంమంత్రి మేక‌తోచి సుచ‌రిత స్పందించారు. శుక్ర‌వారం గుంటూరు జిల్లా ప‌రిధిలోని ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీలో రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఏర్పాటు చేసిన‌ మ‌హిళా పార్ల‌మెంటును ఆమె ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ఆమె మ ఈడియాతో మాట్లాడుతూ….. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గ‌బోద‌న్న‌ట్లుగా ఆమె వ్యాఖ్య‌లు చేశారు. హైకోర్టు తీర్పును ఖచ్చితంగా స‌వాల్ చేసి తీర‌తామ‌ని ఆమె పేర్కొన్నారు. పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌కు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని పేర్కొన్నారు. రాజ‌దాని ఎక్క‌డ ఉండాల‌నే దానిని నిర్ణ‌యించుకునే అధికారం రాష్ట్రాల‌కు ఉంద‌ని కూడా ఆమె తెలిపారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం చాలా సార్లు స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement