Friday, April 26, 2024

సూర్యాపేటలో కారు దగ్ధం.. బయటికి వెళ్లొచ్చి పార్కింగ్ చేసిన వెంటనే..

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రిలో సోమవారం మధ్యాహ్నం కారు దగ్ధం అయ్యింది. గ్రామానికి చెందిన గుజ్జ శ్యామ్ సుందర్ రెడ్డి బయటకు వెళ్లి వచ్చి ఇంటి ముందు నిలిపిన కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. అంత‌లోనే కారు పూర్తిగా కాలి బుడిదయ్యింది. కాగా, ఈ ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేక పోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement