Friday, April 26, 2024

కేంద్రంపై “ZERO” తో ఫ్లెక్సీ వార్

హైదరాబాద్ – కేంద్ర బడ్జెట్‌-2023లో తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది . ఇందుకోసం రొటీన్‌గా కాకుండా వినూత్నంగా ప్లాన్ చేసింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది ‘జీరో’ అని ఫ్లెక్సీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి తమ అసంతృప్తిని తెలియజేసింది బీఆర్ఎస్. ‘ZERO’ అనే పదాన్ని ఎరుపు రంగులో ప్రింట్ చేయించి.. ‘O’ అనే అక్షరంలో ప్రధాని మోడి త లదించుకున్నట్లుగా ఫొటో ఉంది. ఈ ఒక్క ఫ్లెక్సీతో తెలంగాణపై కేంద్రం ఎలా వ్యవహరిస్తోందో జనాలకు చెప్పడానికి ప్రయత్నించింది. ఈ ఫ్లెక్సీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఫ్లెక్సీని బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లుగా ఎక్కడా ఆధారాలు లేకపోవడం కొసమెరుపు.

https://twitter.com/KP_Aashish/status/1621073876641013761?t=sHkaimbw7PhyXc49xjalaQ&s=19

Advertisement

తాజా వార్తలు

Advertisement