Saturday, April 27, 2024

కెమికల్ ట్యాంకులో పడి ఇద్దరు దుర్మరణం

రేణిగుంట, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని గాజుల మండ్యం పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ కర్మాగారంలో ప్రమాదవశాత్తు ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన గురువారం చోటుచేసుకుంది. గాజులమండ్యం సిఐ ఆరోహణరావు కధనం ప్రకారం పిల్లపాలెం హరిజనవాడకు చెందిన వెంకటేష్ (22) నరేంద్ర (23) గాజుల మండ్యం నందుగల శ్రీరాధ బయోటెక్ కర్మాగారంలో కూలి పనులు చేస్తున్నారు.

విధుల్లో భాగంగా కంపెనీకి చెందిన కెమికల్ సింటెక్స్ ట్యాంక్ లోకి దిగి శుభ్రపరిచే క్రమంలో సొమ్ముసిల్లి పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన తోటి కార్మికులు కెమికల్ సింటెక్స్ ట్యాంక్ ను కట్ చేసి అపస్మార్క స్థితిలో ఉన్న వెంకటేష్, నరేంద్రను హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామనీ సిఐ ఆరోహణరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement