Tuesday, April 30, 2024

MBNR : బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం

గద్వాలప్రతినిధి, నవంబర్ 22 (ప్రభ న్యూస్)
గద్వాల జిల్లా కేంద్రంలోని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలో బిఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పర్యటిస్తూ కెసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎన్నికల ప్రచారంలో వివరిస్తూ ప్రజల మధ్యకు వెళ్తున్నారు.

అసోసియేషన్ సభ్యులతో, కార్మికులతో కలిసి ఎమ్మెల్యే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ పాలన మీ ముందు ఉందని.. ప్రజల ఆశీస్సులతోనే తెలంగాణలో పాలన చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు బంధు రూ.10 వేలు నుంచి రూ.16 వేలకు పెరగాలంటే కచ్చితంగా బీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేసి గెలిపించుకుందాం అని విజ్ఞప్తి చేశారు. కరెంటు 3 గంటలు చాలని కాంగ్రెస్‌ చెబుతోందని, కానీ ప్రజలు మాత్రం 24 గంటల కరెంటు కావాలని అంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement