Sunday, May 5, 2024

Murmu: పుట్టపర్తిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘ‌న‌స్వాగ‌తం పలికిన అధికార యంత్రాంగం

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 22 (ప్రభన్యూస్) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తి చేరుకున్నారు. శ్రీ సత్యసాయి విమానాశ్రయంలో బుధవారం మధ్యాహ్నం ఘన స్వాగతం లభించింది. ఒడిశాలోని జహర్సుగూడ విమానాశ్రయం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి మధ్యాహ్నం లకు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఉషాశ్రీ చరణ్ , జిల్లా పరిషత్ చైర్ పర్సన్, బోయ గిరిజమ్మ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఐఏఎస్, అడిషనల్ డిజిపి లా అండ్ ఆర్డర్ విజయవాడ డా. శంఖబ్రరత బగ్చి, కర్నల్ యన్. రమేష్ గ్రూప్ కమాండర్ ఎన్. సి సి గ్రూప్ కర్నూల్, పుట్టపర్తి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ ఎస్పీ మాధవరెడ్డి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, పుట్ట పర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీలు షేక్ మొహమ్మద్ ఇక్బాల్, ఎస్. మంగమ్మ ,భూమి రెడ్డి రామ గోపాల్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డా. ఎం. తిప్పేస్వామి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి, ఆంధ్ర ప్రదేశ్ బిజెపి ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు రాష్ట్రపతికి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement