Thursday, May 2, 2024

HYD : బీఆర్ఎస్ అభ్య‌ర్థికి మ‌ద్ధ‌తుగా ఎన్నిక‌ల ఎల్బీనగర్ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ రామ్మోహన్ గౌడ్

కర్మన్ ఘాట్, నవంబర్ 22 (ప్రభ న్యూస్)ఎల్బీనగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎల్బీనగర్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ ముద్దగొని రామ్మోహన్ గౌడ్ అన్నారు. ఈ నెల 30వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం చైర్మన్ నల్ల రఘుమా రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చంపాపేట డివిజన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రామ్మోహన్ గౌడ్ పాల్గొని చంపాపేట ఓల్డ్ విలేజ్, రెడ్డి బస్తీ, నెహ్రు నగర్ కటికొనికుంట, ముస్లిం బస్తీ , రామచిలుకల బస్తీ, దాసరి బస్తీ, సుల్తాన్ అల్వా , రాజి రెడ్డి నగర్ , రెడ్డి కాలనీ లలో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి సుధీరన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో గడ్డి అన్నారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకోజ్ కృష్ణమాచారి , బస్సు గూడెం జంగారెడ్డి, డివిజన్ యూత్ అధ్యక్షులు గండికోట శ్రీనాథ్, చంపాపేట డివిజన్ పార్టీ అధ్యక్షులు ముడుపు రాజి రెడ్డి, వింజమూరి రాఘావా చారి, మంద సత్యనారాయణ రెడ్డి , మెట్టు వెంకట రెడ్డి బీసుకుంట్ల సతీష్ గౌడ్, కొత్తపేట ప్రభాకర్, అంగోటి జంగయ్య, బీసుకుంట్ల సుదర్శన్ నగౌడ్ , తిరుపతి రెడ్డి, దర్వేష్, ఖాదర్, ఊరుకొండ రమాదేవి, గోకుల్ సరోజ కవిత, అంబిక, రజని రెడ్డి, షన్ను, విజయలక్ష్మి, రాధిక, పుష్ప, ఉష, సరోజ, చందు యాదవ్, చేగొని మల్లేష్ గౌడ్ , పన్నా ముదిరాజ్,ప్రతాప్, శ్రీకాంత్, దేవేందర్, శ్రీధర్, శివ, సంతు, బాలాజీ, సురేందర్ రెడ్డి, అరవింద్, శివ కుమార్ , ప్రసాద్ , ఆఫ్రిద్ , మూసా భాయ్ , సలీం, షఫీ,ఖదీర్, శ్రీనివాస్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement