Monday, May 13, 2024

BRS – అభివృద్ధికే పట్టం కట్టండి – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభా న్యూస్) 10:నిజామాబాద్ నగరం మును పెన్నడూ లేని విధంగా అభివృ ద్ధి చెందిందని… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజాంబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని… అభివృ ద్ధికి పట్టం కట్టండని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శుక్రవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ బిగాల నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంగా నగరంలోని గంగస్థాన్లో గల అర్బన్ ఎమ్మెల్యే నివాసంలో గణేష్ బిగాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీర తిలకం దిద్దారు. కల్వకుంట్ల కవిత స్వయంగా కారు నడుపుతూ ఎమ్మెల్యే గణేష్ బిగాల తో నామినేషన్ వేసారు. నామినేషన్ వేసిన అనంతరం విలేకరులతో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో బీ అర్ ఎస్ అభ్యర్థులు అఖండ మెజారిటీతో విజయం సాధిస్తా రని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కెసిఆర్ ముఖ్య మంత్రిగా బీఆర్ఎస్ పార్టీ రికార్డు బద్దలు కొట్టనుందని అన్నారు. నిజామాబాద్ ను సర్వంగా సుందరంగా తీర్చిది ద్దిన బిగాలకి ప్రజలు పట్టం కట్టనున్నారని తెలిపారు.

మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. – బిగాల

గత తొమ్మిది సంవత్సరాల క్రితం నిజాంబాద్ నగరం ఏ విధంగా ఉందో ప్రస్తుతం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించి అవకాశమిచ్చి ఆశీర్వదిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నిజామాబాద్ అర్బన్ బిఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాల అన్నారు.కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల హయాంలో నిజామా బాద్ అభివృద్ధి చెందలేదని, పదేళ్లలో నిజామాబాద్ రూపు రేఖలు మార్చామని, నిజామా బాద్ లో ఐటి హబ్, జిల్లా కలెక్ట రేట్, మిని ట్యాంక్ బండ్ ,బొడ్డె మ్మ చెరువు, సెంట్రల్ లైటింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిజాంబాద్ అర్బన్ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement