Wednesday, May 8, 2024

TS : తెగిపడ్డ క్రేన్​ వైర్​.. వ్యక్తి మృతి…

క్రేన్‌ వైర్ తెగి పూడిక మట్టి మీదపడి ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో నర్సింహులపేట మండలం నరసింహపురం బంజర గ్రామ పంచాయతీ పరిధిలోని పత్ని తండాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తండాలోని ఓ వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైరు తాడు తెగి పూడిక మట్టి మీద గుగులోతు రవి (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. రవి మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement