Friday, May 3, 2024

TS : 108లో పండంటి బిడ్డకు జననం

పెద్దపల్లి జిల్లాలో పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణీని 108వాహ‌నంలో ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ప్ర‌స‌వించింది. పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి..త‌ల్లి, బిడ్డను కాపాడారు.

- Advertisement -

ధర్మారం మండలం శాయంపేట గ్రామానికి చెందిన మైస సోనియా(24) పురిటి నొప్పులతో బాధపడుతూ రాత్రి 9గంటలకు మేడారం ప్రభుత్వ దవాఖానలో చేరింది. అక్కడ డెలివరీ కాకపోవడంతో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. మేడారం నుంచి పెద్దపల్లి జిల్లా మాతా శిశు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్‌లో నొప్పులు అధికమయ్యాయి. వెంటనే 108 సిబ్బంది ఈఆర్సీపీ డాక్టర్ సూచన మేరకు అంబులెన్స్‌లోనే డెలివరీ చేశారు. సోనియా పండంటి ఆడ‌బిడ్డకు జ‌న్మనిచ్చింది. వీరిని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు దవాఖానకు తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. కాగా, 108 సిబ్బందికి సోనియా కుటుంబ స‌భ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement