Thursday, May 2, 2024

Bodhan – జిల్లా జైల్లో ఎంఐఎం కార్యకర్తలకు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ పరామర్శ

బోధన్ పట్టణంలో ఎంఐఎం కార్యకర్తలకు ప్రస్తుత ఎమ్మెల్యే షకీల్ మధ్య వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. గత నాలుగు రోజుల క్రితం బోధన పట్టణంలో ఎమ్మెల్యే పర్యటించే సందర్భంలో ఎంఐఎం కార్యకర్తలు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డుకున్నారు. ఇదే అదునుగా భావించిన ఎమ్మెల్యే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను హత్య చేయడానికి ప్రయత్నం చేశారంటూ బోధన్ పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు.

సంఘటన జరిగిన వెంటనే ఇరువురిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని నిజాంబాద్ జిల్లా జడ్జి వద్ద హాజరు పరిచారు. హత్యకు ప్రయత్నం చేసిన వారిని రిమాండ్కు తరలించాలని జడ్జ్ ఆదేశించారు. ఎంఐఎం నేత ఓవైసీ సోమవారం నిజాంబాద్ జిల్లా కేంద్రాన్ని చేరుకుని జిల్లా జైల్లో ఉన్న ఎంఐఎం కార్యకర్తలను పరామర్శించారు. వారి వెంట బోధన్ ఎంఐఎం అధ్యక్షులు ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement