Thursday, May 2, 2024

TS: వైదిక పూజలతో.. క్యాంప్ ఆఫీసుల్లోకి బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రభ న్యూస్ బ్యూరో, ఆదిలాబాద్, డిసెంబర్ 4 : వైదిక పూజలు.. లక్ష్మీ గణపతి హోమం.. సుదర్శన యాగం.. గృహప్రవేశానికి చేసే ముందు చేసే గోమాత పూజలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. బీజేపీ నుండి కొత్తగా గెలిచిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వేద పండితులు నిర్వహించిన శాస్త్రోక్త పూజల నడుమ క్యాంపు కార్యాలయంలోకి గృహప్రవేశం చేశారు.

ఆదిలాబాదులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ దంపతులు శుభ ముహూర్తం మేరకు వైదిక పూజలు నిర్వహించి క్యాంపు కార్యాలయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ కార్యకర్తల సందడి .. కొలాహలం.. మంగళ వాయిద్యాలు.. ప్రముఖుల రాకతో పండగ వాతావరణాన్ని తలపించింది. అధికారులు సైతం ఎమ్మెల్యేలను కలుసుకొని అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వకలాభరణం ఆదినాథ్, అంకం రమేష్, లోక ప్రవీణ్ రెడ్డి, బి గంగారెడ్డి, పట్టణ నాయకులు, కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్, దినేష్ మాటోలియా, లాలా మున్నా, జోగు రవి, కృష్ణ యాదవ్, సామ రవి, రత్నాకర్ రెడ్డి, కటకం రాందాస్, ఎన్రాల నగేష్, పద్మావర్ రాకేష్, ఏనగందుల కృష్ణ, రాకేష్, బండారి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement