Monday, April 29, 2024

Bellampally : సీఎం కేసీఆర్ చిత్రపటానికి.. దివ్యాంగులు పాలాభిషేకం

బెల్లంపల్లి (ప్రభ న్యూస్) : ఇటీవల మంచిర్యాలలో జరిగిన భారీ భహిరంగ సభ లో దివ్యాంగులకు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి రూపాయలు పెన్షన్ ప్రకటించి.. మొత్తంగా 4016 రూపాయలు వచ్చే నెల నుండి అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ , జడ్పిటిసి బానయ్య, కౌన్సిలర్ గోసిక రమేష్ , సర్పంచ్ లు రాజ మొగిలి, ప్రమీల గౌడ్ , నాయకులు శ్రీధర్ , శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement