Friday, May 3, 2024

Big Breaking : విషాదం.. గుండెపోటుతో ములుగు జెడ్పీ చైర్మన్ మృతి

  • అజర హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి
  • భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు
  • శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు

ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లా జడ్పీ చైర్మన్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ ఆదివారం ఉదయం 11 గంటల నిమిషాల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. గత 6 నెలలుగా గుండె నొప్పితో బాధపడుతున్న కుసుమ జగదీష్ ఆదివారం ఉదయం మరోసారి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన హనుమకొండలోని అజర హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి చెందారు. దీంతో ఒక్క‌సారిగా ములుగు జిల్లాతో పాటు మల్లంపల్లిలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అజర హాస్పిటల్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోకాసంద్రంలో మునిగిపోయారు.

మంత్రి దిగ్భ్రాంతి..
ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జ‌గ‌దీశ్వ‌ర్ మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతి దురదృష్టకరం అని అన్నారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం అన్నారు. వారితో ఉన్న సాన్నిహిత్యం మంత్రి గుర్తు చేసుకున్నారు. ములుగు జిల్లాలో చురుకైన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్ గా ప్రజలకు సేవలు అందిచారని మంత్రి కొనియాడారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న నాయకుడి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నా అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

- Advertisement -

నేలకొరిగిన ఉద్యమ కుసుమం.. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దిగ్భ్రాంతి..
ములుగు జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్ చార్జి ములుగు జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ కాసేప‌టి క్రితం హనుమకొండలోని అజర ఆసుపత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సహచరులుగా, సన్నిహితుడిగా ఉన్న జగదీష్ అకాల మృతి విషయం తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. జగదీష్ అకాల మృతి పట్ల సంతాపం తెలిపారు.

జెడ్పీ చైర్మన్ జ‌గ‌దీష్ మ‌ర‌ణం ములుగు జిల్లాకు తీర‌ని లోటు : ఎమ్మెల్యే సీత‌క్క‌
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ మరణం ములుగు జిల్లాకు తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆదివారం హన్మకొండ అజ‌ర హాస్పటల్ లో జగదీష్ గుండెపోటుతో మరణించగా వారి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement