Saturday, May 4, 2024

Mahabubnagar: ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి

మహబూబ్ నగర్,క్రైమ్ : ట్రాక్టర్ పల్టీ కొట్టి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ (18) అనే యువకుడు ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. సెలవుల్లో ఖాళీగా ఉండటంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా సహాయం చేస్తూ కొద్దిరోజులుగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో లక్ష్మణ్ ఇసుక లోడ్ తో ట్రాక్టర్ నడుపుతూ వస్తుండగా అదుపుతప్పి.. చెరువు కట్ట కిందికి దూసుకెళ్లి పల్టీ కొట్టింది.దీంతో లక్ష్మణ్ చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement