Saturday, May 18, 2024

TS : స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ…ప్ర‌చారం చేస్తూ… మార్నింగ్ వాక్‌లో కేటీఆర్

రాజ‌న్న‌సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప‌ర్య‌టించారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఉద‌యం మార్నింగ్‌లో భాగంగా రైతుబ‌జార్‌, గాంధీచౌక్‌, లేబ‌ర్ అడ్డ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌తో ముచ్చటించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్‌కు ఓటేయాల‌ని కోరారు.

- Advertisement -

ఓ హోటల్‌లో స్థానికులతో కలిసి చాయ్‌ తాగారు. అనంతరం స్థానిక సిరిసిల్ల రైతు బజార్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్న వారు కొన్ని సూచనలు చేశారు. త్రాగు నీరు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిర్లు వేయాలని కోరారు. 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశించారు.

చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అప్పుడు నీళ్లు కరెంటు సక్రమంగా వచ్చేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయిన తరువాత, వాగులో నీళ్లు పోయాయని తర్వాత నెల కూడా పెన్షన్ రావడం లేదని వారు బాధను వ్యక్తం చేశారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రైతులను పట్టించుకోలేదని, రుణమాఫీ చేయలేదనీ రైతు బంధు రాలేదని అంటున్నారని తెలిపారు.. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ వాటికి ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు తెలిపారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement