Thursday, May 2, 2024

Breaking : బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష..

సినీ నటుడు, నిర్మాత, బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తుది తీర్పు ఇస్తూ ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద బండ్ల గణేష్ రూ.95 లక్షలు తీసుకున్నారు.

అనంతరం పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో జెట్టి వెంకటేశ్వర్లకు బండ్ల గణేష్ చెక్ ఇచ్చారు. ఈ చెక్ బౌన్స్ కావడంతో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించింది. అలాగే కోర్టు ఖర్చులకు అదనంగా రూ.10 వేలు కూడా చెల్లించాలని పేర్కొంది. అయితే బండ్ల గణేష్ కోర్టు తీర్పును ఎగువ కోర్టుకు సవాల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement