Wednesday, May 8, 2024

ఔట్ సోర్సింగ్ సిబ్బంది పై లాఠీ ఛార్జ్ చేయడం దారుణం: బండి సంజయ్..

గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా తొలగించడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలవల్లే గాంధీ ఆసుపత్రిలో 1700 మంది నర్సులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం రోడ్డెక్కిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణమని ఖండించారు. కరోనా కాలంలో ప్రాణాలకు ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు రోగులకు సేవలందిస్తూ మంచి పేరు సంపాదించిన నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే నజరానా ఇదేనా? అని మండిపడ్డారు.

కనీస ముందస్తు సమాచారం లేకుండా నర్సులను ఉద్యోగుల నుండి తొలగించడం అన్యాయమన్నారు. వెంటనే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూ బజారున పడేయడం శోచనీయమన్నారు. వైద్యశాఖ పటిష్టానికి తక్షణమే ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులుసహా పారా మెడికల్ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: హరీష్‌రావుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement