Thursday, May 2, 2024

పవన్ సినిమాలో ఆమెనే ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. అందులో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంలో హీరోయిన్ గా నటించబోయేది ఎవరు అనే దానిపై రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. పవన్ సరసన నిత్యమీనన్ ఫిక్స్ అయినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ సరసన నటించే హీరోయిన్ గా నిత్య మీనన్ నే ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మాటల మంత్రికుడు కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement