Friday, April 26, 2024

ఆటో బోల్తా : 8మంది విద్యార్థుల‌కు తీవ్ర‌గాయాలు

ఓ ఆటో బోల్తా ప‌డి 8మంది విద్యార్థుల‌కు తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో మొత్తం ఇరవై మంది విద్యార్థున్నట్లు సమాచారం. విద్యార్థులంతా ముజాహిద్ పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జ‌రిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement