Friday, May 24, 2024

ఏడు కార్ల‌ని ఢీ కొట్టిన ‘ఆర్మీ’ వాహ‌నం

ఏడు కార్ల‌ని ఢీకొట్టింది ఇండియ‌న్ ఆర్మీ వాహ‌నం. హైద‌రాబాద్ శివారులో ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. ఆర్మీ వాహ‌నం బీభ‌త్సం సృష్టించింది. ఏకంగా ఏడు కార్ల‌ని ఢీకొడుతూ ముందుకెళ్లింది ఆర్మీ వాహ‌నం. మేడ్చల్ జిల్లా తూంకుంట సమీపంలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరం నుండి బయటకు వెళుతున్న ఆర్మీ వాహనం అలంకృత రిసార్డ్ వద్దకు రాగానే అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఇలా ఏడు కార్లను ఢీకొడుతూ ముందుకెళ్లింది. దీంతో మూడు కార్లు ధ్వంసమవగా మరో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement