Sunday, May 19, 2024

పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించండి.. మంత్రి కేటీఆర్‌కు దాసరి వినతి

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): పెద్దపల్లి పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విన్నవించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి పెద్దపల్లి పట్టణంలో అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లను కేటాయించాలని విన్నవించారు.

మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డులలో డ్రైనేజీలతోపాటు ఇతర వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లిలో ప్రజలకు మరిన్ని వసతులు అవసరం ఉన్నాయని, వాటి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్‌ నిధుల మంజూరు పట్ల సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement