Sunday, May 19, 2024

Breaking: వ‌రంగ‌ల్ చేరుకున్న రాహుల్.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ‌

కాంగ్రెస్ ముఖ్య నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఇవ్వాల‌ వ‌రంగ‌ల్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో హైద‌రాబాద్ వ‌చ్చిన ఆయ‌న‌.. అక్క‌డి నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో హ‌న్మ‌కొండ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. తొలుత ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు రాహుల్ గాంధీ. వారితో మాట్లాడి సాద‌క‌బాద‌కాల‌ను అడిగి తెలుసుకున్నారు. కాగా, సంఘ‌ర్ష‌ణ స‌భ‌కు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. కాగా, ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేత‌, ఎంపీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప్ర‌సంగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement