Sunday, May 26, 2024

ఏపీ ఇంటర్​ ఎగ్జామ్స్​లో మరో ఘోరం.. చైతన్య కాలేజీలో సెల్​ఫోన్​తో ప్రిన్సిపల్​ హల్​చల్​

నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమ య్యాయి. అయితే తొలిరోజు నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న శ్రీ చైతన్య జూని యర్‌ కళాశాల (08054) లో పరీక్షల విధులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేంద్రబాబు సెల్‌ఫోన్‌ కలిగి ఉండడాన్ని ఇంటర్‌ బోర్డు అధికారులు గుర్తించారు. ఆ విషయాన్ని ఆయన ఇంటర్‌ బోర్డు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఆర్‌ఐవో వరప్రసా ద్‌ను ఆదేశించారు. బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు నెల్లూరు ఆర్‌ఐవో సురేంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement