Saturday, April 27, 2024

కూరగాయల మార్కెట్‌ నిర్మాణ పనులు..

బెల్లంపల్లి : పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ యువజన అధ్యక్షుడు సన్నిబాబు, బెల్లంపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలువేరు నర్సింగం తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement